4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- November 05, 2025
యూఏఈ: యూఏఈలోని ముసాందం దక్షిణ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభంవించింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) యొక్క నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్టు తెలిపారు. యూఏఈ నివాసితులు భూప్రకంపనలను అనుభవించారని, అయితే, మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం పెద్దగా లేదని స్పష్టం చేసింది.
యూఏఈ పెద్ద భూకంప జోన్లో లేనప్పటికీ, అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉందని నిపుణులు తెలిపారు. ఇరాన్ మరియు ఇరాక్ల గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణిలో తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను ఉత్పత్తి చేస్తుందని NCMలోని భూకంప పర్యవేక్షణ విభాగం తాత్కాలిక అధిపతి మొహమ్మద్ అల్హస్సాని వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









