4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- November 05, 2025
యూఏఈ: యూఏఈలోని ముసాందం దక్షిణ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభంవించింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) యొక్క నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్టు తెలిపారు. యూఏఈ నివాసితులు భూప్రకంపనలను అనుభవించారని, అయితే, మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం పెద్దగా లేదని స్పష్టం చేసింది.
యూఏఈ పెద్ద భూకంప జోన్లో లేనప్పటికీ, అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉందని నిపుణులు తెలిపారు. ఇరాన్ మరియు ఇరాక్ల గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణిలో తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను ఉత్పత్తి చేస్తుందని NCMలోని భూకంప పర్యవేక్షణ విభాగం తాత్కాలిక అధిపతి మొహమ్మద్ అల్హస్సాని వివరించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







