4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- November 05, 2025
యూఏఈ: యూఏఈలోని ముసాందం దక్షిణ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభంవించింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) యొక్క నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్టు తెలిపారు. యూఏఈ నివాసితులు భూప్రకంపనలను అనుభవించారని, అయితే, మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం పెద్దగా లేదని స్పష్టం చేసింది.
యూఏఈ పెద్ద భూకంప జోన్లో లేనప్పటికీ, అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉందని నిపుణులు తెలిపారు. ఇరాన్ మరియు ఇరాక్ల గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణిలో తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను ఉత్పత్తి చేస్తుందని NCMలోని భూకంప పర్యవేక్షణ విభాగం తాత్కాలిక అధిపతి మొహమ్మద్ అల్హస్సాని వివరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







