ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- November 06, 2025
మచిలీపట్నం: ప్రముఖ పరిశ్రమాధిపతి, గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చలమలశెట్టి తండ్రి డా. చలమలశెట్టి సురేంద్రనాథ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు — సునీల్, అనిల్, వెంకటేశ్ ఉన్నారు.
డా. సురేంద్రనాథ్ వైద్యరంగంలో విశేష సేవలందించి, ప్రజాహిత భావనతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అల్జీరియా దేశంలో కూడా అనేక సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిశ్రమల వర్గం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
డా. సురేంద్రనాథ్ భౌతికకాయాన్ని మచిలీపట్నం అంత్యక్రియలు నిర్వహించారు.
గ్రీన్కో సంస్థాధినేతలు చలమలశెట్టి సునీల్, అనిల్ తండ్రి మరియు మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటలక్ష్మి భర్త అయిన డా. చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఆయన సోదరుడు రాష్ట్ర బీసీ నాయకుడు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య నిన్న మచిలీపట్నం చేరి డా. సురేంద్రనాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా చలమలశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







