మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- November 08, 2025
మాలి: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో దారుణం చోటుచేసుకుంది. గురువారం నాడు పశ్చిమ మాలిలోని కోబ్రి పట్టణ సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఐదుగురు భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని అక్కడి భద్రతా వర్గాలు శుక్రవారం వెల్లడించగా, బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ధ్రువీకరించింది.
కిడ్నాప్కు గురైన బాధితులు ఒక విద్యుదీకరణ ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు వారిని బలవంతంగా అపహరించుకుపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం, కంపెనీలో పనిచేస్తున్న మిగతా భారతీయులను ముందుజాగ్రత్త చర్యగా రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
దేశంలో భద్రతా సమస్యలు, ఉగ్రవాద ముప్పు
ప్రస్తుతం మాలి సైనిక పాలనలో ఉంది. దేశంలో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, నేర ముఠాల దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో భద్రతా పరిస్థితి క్షీణించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్లకు పాల్పడటం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే ఈ కిడ్నాప్కు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలోనూ అల్-ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం విదేశీయులను కిడ్నాప్ చేసి, 50 మిలియన్ డాలర్ల భారీ విమోచన క్రయం చెల్లించిన తర్వాత విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజా కిడ్నాప్ కూడా డబ్బు కోసమే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









