తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- November 08, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాల ప్రభావం తగ్గి, చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం మరింతగా ఉండబోతోందని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుండి 14 డిగ్రీల మధ్య ఉండవచ్చని సూచించారు. ప్రజలు రాత్రి వేళలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు.
ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రేపటి నుంచి రాష్ట్రంలో చలి ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







