భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 11, 2025
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒమన్-బహ్రెయిన్ దేశాలు నిర్ణయించాయి. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను కొనియాడారు.
ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు ఒమన్ మధ్య శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిర్ణయించారు. అదే సమయంలో ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను, అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







