భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 11, 2025
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒమన్-బహ్రెయిన్ దేశాలు నిర్ణయించాయి. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను కొనియాడారు.
ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు ఒమన్ మధ్య శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిర్ణయించారు. అదే సమయంలో ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను, అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









