భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 11, 2025
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒమన్-బహ్రెయిన్ దేశాలు నిర్ణయించాయి. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను కొనియాడారు.
ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు ఒమన్ మధ్య శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిర్ణయించారు. అదే సమయంలో ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను, అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









