భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- November 11, 2025
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒమన్-బహ్రెయిన్ దేశాలు నిర్ణయించాయి. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్లో ఒమన్ సుల్తానేట్ ఇంటీరియర్ మినిస్టర్ సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైదితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను కొనియాడారు.
ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మరియు ఒమన్ మధ్య శాశ్వత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా భద్రతా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిర్ణయించారు. అదే సమయంలో ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను, అలాగే తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







