కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- November 11, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అబ్దుల్మొహ్సేన్ జాబర్ అల్-జైద్ను కలిసి, తన నియామక ఉత్తర్వుల కాపీని అందజేశారు. భారత్ -కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని వారు సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు ప్రజలకు మధ్య సహకారాన్ని పెంపొందించడానికి నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించారు.
కువైట్లో భారత మొదటి మహిళా రాయబారిగా మరియు గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన రెండవ మహిళగా తనకు లభించిన గొప్ప గౌరవం, ఆనందాన్ని కూడా ఇచ్చిందని రాయబారి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య స్నేహానికి శాశ్వత వారధిగా ఉండటానికి కువైట్లోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీ అందిస్తున్న సహకారాన్ని ఆమె ప్రశంసించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







