జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- November 13, 2025
యూఏఈ: జీసీసి స్థాయిలో 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభమైంది. ఇది సభ్య దేశాల మధ్య సులువుగా ప్రయాణించేలా చూస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రయోగాత్మకంగా యూఏఈ, బహ్రెయిన్ మధ్య ప్రారంభించనున్నారు.
కొత్త వ్యవస్థ గల్ఫ్ పౌరులు ఒకే చెక్పాయింట్లో అన్ని ప్రయాణ విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుందని జిసిసి సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి తెలిపారు. కువైట్ నగరంలో జరిగిన జిసిసి అంతర్గత మంత్రుల 42వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ లో యూఏఈ, బహ్రెయిన్ మధ్య విమాన ప్రయాణం ద్వారా పైలట్ దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ వ్యవస్థను ఆరు GCC సభ్య దేశాలకు విస్తరిస్తామని అల్బుదైవి చెప్పారు.
మరోవైపు యూనిఫైడ్ GCC పర్యాటక వీసాను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. స్కెంజెన్-తరహా వీసా జారీ పైలట్ దశ ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని యూఏఈ ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. అధికారికంగా GCC గ్రాండ్ టూరిస్ట్ వీసా అని పిలువబడే వీసా ఒకే పర్యాటక గమ్యస్థానంగా గల్ఫ్ ఆకర్షణను పెంచుతుందని అల్ మర్రి అన్నారు. గల్ఫ్-వైడ్ వీసా 2026 నాటికి లేదా 2027 నాటికి పూర్తిగా అమలులోకి రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







