జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- November 13, 2025
యూఏఈ: జీసీసి స్థాయిలో 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభమైంది. ఇది సభ్య దేశాల మధ్య సులువుగా ప్రయాణించేలా చూస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రయోగాత్మకంగా యూఏఈ, బహ్రెయిన్ మధ్య ప్రారంభించనున్నారు.
కొత్త వ్యవస్థ గల్ఫ్ పౌరులు ఒకే చెక్పాయింట్లో అన్ని ప్రయాణ విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుందని జిసిసి సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి తెలిపారు. కువైట్ నగరంలో జరిగిన జిసిసి అంతర్గత మంత్రుల 42వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ లో యూఏఈ, బహ్రెయిన్ మధ్య విమాన ప్రయాణం ద్వారా పైలట్ దశ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ వ్యవస్థను ఆరు GCC సభ్య దేశాలకు విస్తరిస్తామని అల్బుదైవి చెప్పారు.
మరోవైపు యూనిఫైడ్ GCC పర్యాటక వీసాను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. స్కెంజెన్-తరహా వీసా జారీ పైలట్ దశ ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని యూఏఈ ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. అధికారికంగా GCC గ్రాండ్ టూరిస్ట్ వీసా అని పిలువబడే వీసా ఒకే పర్యాటక గమ్యస్థానంగా గల్ఫ్ ఆకర్షణను పెంచుతుందని అల్ మర్రి అన్నారు. గల్ఫ్-వైడ్ వీసా 2026 నాటికి లేదా 2027 నాటికి పూర్తిగా అమలులోకి రావచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







