AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- November 14, 2025
తిరుమల: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగించి చాట్బాట్ ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి, గదుల లభ్యత విరాళాలు ఇతర సేవలకు సంబం ధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందే వెసలుబాటు టిటిడి(TTD) అందుబాటులోకి తీసుకువస్తోంది. అమెజాన్ వెబ్సర్వీస్తో కలసి ఏర్పాటు కానున్న ఈ సాంకేతికతతో ఏకంగా 13 భాషల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.దర్శనం, వసతి, విరాళాల వంటి వివరాలు క్షణాల్లో భక్తులు తెలుసుకునే సదుపాయం రానుంది. ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్సర్వీసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఏఐ ఆధారిత చాట్బాట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టిటిడి ప్రకటించింది. భక్తులు తమ ఫిర్యాదులు, సూచనలను సలహాలు కూడా చాట్బాట్ ద్వారా టిటిడి దృష్టికి తీసుకెళ్ళే వెసలుబాటు కలగనుంది.
ఈ చాట్బాట్లో స్పీచ్ టు టెక్స్ట్ (మాట్లాడితే పదాలుగా), టెక్స్ టు స్పీచ్ ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్బాట్కు అవసరమైన సాఫ్ట్వేరు ఐటి దిగ్గజం టిసిఎస్ అభివృద్ధి చేస్తోంది. టిటిడి పాలనలో పారదర్శకత పెంపొందించడంతోబాటు ఎస్వీబిసి ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నారు. వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిరీక్షణ లేకుండా సకాలంలో వీలైనంత త్వరగా భక్తులకు దేవుని వీక్షణభాగ్యం కలిగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు.సిఎం చంద్రబాబు ఆదేశాలతో టిటిడి చైర్మన్ బొల్లినేని రాజ గోపాల్ నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి కృత్రిమమేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహకారం టిసిఎస్తో ఒప్పందం కుదుర్చుకుని అమలుచేయనున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్లో సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే.దర్శన విధివిధానాలు, వస్త్రధా రణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







