యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- November 17, 2025
యూఏఈ: భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండవ దశ మొదలైంది. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా, మరికొందరు డిసెంబర్ 9న తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
"ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు గత ఓటరు ID కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫారమ్లకు ఫిల్ చేసి పంపాను" అని దుబాయ్ నివాసి అషీమ్ పికె తెలిపారు.
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ, కర్ణాటకతో సహా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో SIR విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం, తప్పుడు ఎంట్రీలను తొలగించడం, కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతుంది.
చాలా మంది ప్రవాస భారతీయులకు (NRI) ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశమని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరికే అన్నారు. ఇండియాలో NRI ఓటరు నమోదు 2010లో ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 2011లో NRIలను “విదేశీ ఓటర్లు”గా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!









