యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- November 17, 2025
యూఏఈ: భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండవ దశ మొదలైంది. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా, మరికొందరు డిసెంబర్ 9న తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
"ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు గత ఓటరు ID కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫారమ్లకు ఫిల్ చేసి పంపాను" అని దుబాయ్ నివాసి అషీమ్ పికె తెలిపారు.
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ, కర్ణాటకతో సహా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో SIR విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం, తప్పుడు ఎంట్రీలను తొలగించడం, కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతుంది.
చాలా మంది ప్రవాస భారతీయులకు (NRI) ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశమని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరికే అన్నారు. ఇండియాలో NRI ఓటరు నమోదు 2010లో ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 2011లో NRIలను “విదేశీ ఓటర్లు”గా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







