యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- November 17, 2025
యూఏఈ: భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండవ దశ మొదలైంది. దీంతో యూఏఈలోని భారత ప్రవాసులు ఓటర్ల జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇండియాలో వారి కుటుంబాలకు తమ ఐడెంటిటీ ఫోటో కాపీలను పంపుతుండగా, మరికొందరు డిసెంబర్ 9న తదుపరి దశ ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు.
"ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు గత ఓటరు ID కాపీతో సహా నా అన్ని డాక్యుమెంట్స్ ను నా తల్లిదండ్రులకు అలాగే అవసరమైన ఫారమ్లకు ఫిల్ చేసి పంపాను" అని దుబాయ్ నివాసి అషీమ్ పికె తెలిపారు.
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ముందు కేరళ, కర్ణాటకతో సహా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో SIR విధానాన్ని భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం చివరిసారిగా పూర్తయిన ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ధృవీకరించడం, తప్పుడు ఎంట్రీలను తొలగించడం, కొత్త వాటిని యాడ్ చేయడం జరుగుతుంది.
చాలా మంది ప్రవాస భారతీయులకు (NRI) ఓటింగ్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశమని భారత సామాజిక కార్యకర్త మునీర్ బెరికే అన్నారు. ఇండియాలో NRI ఓటరు నమోదు 2010లో ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 2011లో NRIలను “విదేశీ ఓటర్లు”గా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









