సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!

- November 19, 2025 , by Maagulf
సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!

యూఏఈ: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది భారతీయులే.ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఇప్పుడు సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ షోయాబ్‌గా గుర్తించారు. అతను ఇదే ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయాడని వారి బంధువు  మీడియాకు తెలిపారు.

ఈ విషాద ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 3 తరాలు మరణించాయి. 9 మంది పిల్లలు సహా 18 మంది మరణించారు.మొత్తంగా ప్రమాదంలో 28 మంది మహిళలు, 17 మంది పురుషులు మరణించారు. బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణలో మరియు జెడ్డాలో భారత మిషన్ ద్వారా హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. మదీనాలో బస్సు ఢీకొన్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని సౌదీ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత, మృతదేహాలకు వారి మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com