ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- November 19, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అడవి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టుల (AP) మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నాయకుడు దేవ్జీ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటన తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడవి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ను పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు.
ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్చంద్ర లడ్డా ధృవీకరించారు. ఆయన వివరాల్లో భాగంగా చెప్పారు తాజా కాలంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లోకి(AP)చొరబడే ప్రయత్నాలు పెరిగాయని, దీనిని ఎదుర్కొనేందుకు నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని తెలిపారు. నవంబర్ 17న ప్రారంభించిన ఆపరేషన్లో భాగంగా, 18వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగి హిడ్మా మద్వితో సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ప్లాటూన్ సభ్యులు, ఏరియా కమిటీ నాయకులు ఉన్నారు. ఆపరేషన్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









