యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!

- November 20, 2025 , by Maagulf
యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!

యూఏఈ: యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలలో వీసా ఆన్ అరైవల్‌ను పొందవచ్చని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. గతంలో, ఇండియాలోని ఆరు విమానాశ్రయాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ సేవను ఇప్పుడు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా మరియు ముంబైలతో పాటు కొచ్చిన్, కాలికట్, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు విస్తరించారు.

గతంలో ఈ-వీసా లేదా రెగ్యులర్/పేపర్ వీసా పొందిన యూఏఈ పౌరులకు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది. మొదటిసారి ఇండియాను సందర్శించే యూఏఈ జాతీయులు ఇప్పటికీ ఈ-వీసా లేదా రెగ్యులర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. బిజినెస్, టూరిజం, సెమినార్స్ మరియు వైద్య ప్రయోజనాల కోసం 60 రోజులకు మించని కాలానికి ఇండియాను సందర్శించే యూఏఈ జాతీయులకు వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది.  
ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ భారతీయ పౌరులు మరియు సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వారి కుటుంబాల కోసం వీసా-ఆన్-అరైవల్ కార్యక్రమాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు కెనడా లకు చెందిన చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్లు కలిగిన భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని పొందవచ్చని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com