ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- November 20, 2025
మస్కట్: బార్కాలోని విలాయత్లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థకు ప్రైమరీ కోర్టు భారీ జరిమానా విధించింది. OMR 1,500 హోం అప్లైయిన్స్ తయారీ కోసం ఒక వాణిజ్య సంస్థతో ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు నెలల్లో పని పూర్తి చేయాలని OMR 700 అడ్వాన్స్ చెల్లించాడు. అయితే, ఆ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒక్క వస్తువును కూడా సరఫరా చేయలేదు. చెల్లించిన అడ్వాన్సును కూడా తిరిగివ్వలేదు. దాంతో బాధితుడు సదరు సంస్థపై ఫిర్యాదు దాఖలు చేశాడు.
బార్కాలోని వినియోగదారుల రక్షణ పరిపాలన విభాగం కేసును నమోదు చేసి, తదుపరి విచారణకు ఈ ఫైల్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పింపించింది.కేసును సమీక్షించిన కోర్టు.. సంస్థ , దాని ఓనర్ కు చెరో OMR 1,000 జరిమానా, కస్టమర్ చెల్లించిన OMR 700 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలని, అతనికి కలిగిన నష్టాలకు OMR 100 పరిహారంతో పాటు చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







