ఒమన్ లో వాణిజ్య సంస్థ పై OMR2,800 జరిమానా..!!
- November 20, 2025
మస్కట్: బార్కాలోని విలాయత్లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థకు ప్రైమరీ కోర్టు భారీ జరిమానా విధించింది. OMR 1,500 హోం అప్లైయిన్స్ తయారీ కోసం ఒక వాణిజ్య సంస్థతో ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు నెలల్లో పని పూర్తి చేయాలని OMR 700 అడ్వాన్స్ చెల్లించాడు. అయితే, ఆ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒక్క వస్తువును కూడా సరఫరా చేయలేదు. చెల్లించిన అడ్వాన్సును కూడా తిరిగివ్వలేదు. దాంతో బాధితుడు సదరు సంస్థపై ఫిర్యాదు దాఖలు చేశాడు.
బార్కాలోని వినియోగదారుల రక్షణ పరిపాలన విభాగం కేసును నమోదు చేసి, తదుపరి విచారణకు ఈ ఫైల్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పింపించింది.కేసును సమీక్షించిన కోర్టు.. సంస్థ , దాని ఓనర్ కు చెరో OMR 1,000 జరిమానా, కస్టమర్ చెల్లించిన OMR 700 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలని, అతనికి కలిగిన నష్టాలకు OMR 100 పరిహారంతో పాటు చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







