మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- November 21, 2025
కువైట్: మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా ఎదుర్కోవడంలో కువైట్, ఇండియా చేతులు కలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు. ఇండియాలోని కువైట్ రాయబారి మేషల్ అల్-షమాలి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారతదేశ ఆర్థిక యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధిపతి దివాకర్ నాథ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని అల్-షమాలి పేర్కొన్నారు. ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (KFIU) సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమల్లో ఉందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు, భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!







