మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- November 21, 2025
కువైట్: మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా ఎదుర్కోవడంలో కువైట్, ఇండియా చేతులు కలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు. ఇండియాలోని కువైట్ రాయబారి మేషల్ అల్-షమాలి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారతదేశ ఆర్థిక యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధిపతి దివాకర్ నాథ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని అల్-షమాలి పేర్కొన్నారు. ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (KFIU) సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమల్లో ఉందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు, భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







