మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- November 21, 2025
కువైట్: మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులను అందకుండా ఎదుర్కోవడంలో కువైట్, ఇండియా చేతులు కలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు. ఇండియాలోని కువైట్ రాయబారి మేషల్ అల్-షమాలి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారతదేశ ఆర్థిక యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధిపతి దివాకర్ నాథ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని అల్-షమాలి పేర్కొన్నారు. ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (KFIU) సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమల్లో ఉందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు, భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









