TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- January 09, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చాలాకాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఎట్టకేలకు ఊపొచ్చింది. డిసెంబర్ 16న నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఉద్యోగ భర్తీ, సేవా నిబంధనల సవరణలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
టీటీడీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా బర్డ్ ఆసుపత్రి, ఎస్వీ గోశాల, వైద్య విభాగం, అలాగే ఆలయ కైంకర్యాలకు సంబంధించిన విభాగాల్లో విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేలా ఈ సవరణలు తీసుకువచ్చారు.
ప్రభుత్వ అనుమతితో అమలులోకి రానున్న మార్పులు
పాలకమండలి ఆమోదించిన ఈ ప్రతిపాదనలను తుది అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే కొత్త సేవా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు నిలిచిపోయిన నియామక ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
ఈ పరిణామంతో టీటీడీలో ఉద్యోగాల(TTD Jobs) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగోన్నతుల అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. మొత్తం మీద, టీటీడీ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







