కువైట్ లో విద్యా సంస్కరణల పై చర్చలు..!!
- November 22, 2025
కువైట్: కువైట్ లో విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షక ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్కరణలపై చర్చించడానికి కువైట్ విద్యాశాఖ మంత్రి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వైస్-ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ హెడ్ మరియు కిండర్ గార్టెన్ సూపర్వైజర్ వంటి పోస్టులను త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేయనుంది.అనేకమంది టీచర్లు ప్రమోషన్ల కోసం గత ఆరేండ్లుగా వేచి ఉన్నారు.ఈ క్రమంలో తొలుత ప్రమోషన్లు ఇవ్వాలని, ఆ తర్వాతనే డైరెక్టు రిక్రూట్ మెంట్ కు పోవాలని పలువురు సూచించారు.
అయితే, కొన్ని సబ్జెక్టులలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండటంతో చర్చల్లో స్పష్టత కోసం ప్రయత్నించినట్ల ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. అలాగే, కిండర్ గార్టెన్లలో పర్యవేక్షక పోస్టులకు భారీ డిమాండ్ ఉందన్నారు.కాగా, కప్యూటర్ బేస్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, సర్వీస్ రికార్డు, అనుభవం ఆధారంగా కొత్త పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విద్యా మంత్రి జలాల్ అల్-తబ్తబాయి పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు ఈ కొత్త విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై పలు ఉపాధ్యాయ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







