నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లో 15శాతం వాటా విక్రయాo

- July 25, 2016 , by Maagulf
నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లో 15శాతం వాటా విక్రయాo

కేంద్రం నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌లో 15శాతం వాటా విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా షేర్ల విక్రయానికి సంబంధించి మర్చెంట్‌ బ్యాంకర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి మొత్తం మూడు మర్చెంట్‌ బ్యాంకర్లను నియమించే అవకాశం ఉంది. ఈ విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,200 కోట్ల ఆదాయం సమకూరనుంది.
జులై మొదట్లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్‌బీసీసీలో షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (వోఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయానికి పచ్చజెండా వూపింది. దీంతోపాటు ఎన్‌బీసీసీ ఉద్యోగులకు ఇష్యూ ధరపై 5శాతం డిస్కౌంట్‌తో (వోఎఫ్‌ఎస్‌)లో 0.75శాతం షేర్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఉద్యోగులు రూ.2లక్షల వరకు విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com