ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- November 22, 2025
మస్కట్: మస్కట్ మరియు నార్త్ అల్ బటినా గవర్నరేట్లలో పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడిన పలువురిని ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, సీబ్లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్తో సమన్వయంతో ఏడుగురు ముసుగు ధరించిన ఒమన్ జాతీయులను అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు సీబ్లోని విలాయత్లో పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ సృష్టించడంతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని పోలీసులు తెలిపారు.
మరో సంఘటనలో నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సోహార్లోని విలాయత్లో ముసుగు ధరించిన పలువురిని అదుపులోకి తీసుకుంది. వీళ్ల దాడిలో ఒక వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అల్లర్లను ప్రేరేపించడం, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం వంటి ఆరోపణల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







