శ్రీశైలం భక్తులకు అలర్ట్..

- November 24, 2025 , by Maagulf
శ్రీశైలం భక్తులకు అలర్ట్..

శ్రీశైలం: శ్రీశైలంలోని వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.

తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.

ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ కాకుండా ఏ ఇతర లింక్‌లు, పేజీలు ద్వారా బుకింగ్‌లు చేయవద్దని భక్తులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com