సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్లో మార్పులు అవసరం
- November 25, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం త్వరలోనే సమగ్ర విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైందని స్పష్టం చేశారు. సీఎం అభిప్రాయం ప్రకారం, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని భారీగా తగ్గించకపోతే భవిష్యత్తులో పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అధికారులు గుర్తించాలి. పూర్తిగా ప్లాస్టిక్ డిస్పోజల్ వ్యవస్థని క్రమబద్ధీకరించడంతోపాటు, రీసైక్లింగ్ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలన్నారు. అంతేకాకుండా, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ డిస్పోజల్పై స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిందిగా సూచించారు.
హెల్త్ కేర్ ఫెసిలిటీల బయో-వేస్ట్పై కఠిన గడువు
Waste Policy: ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమైనది బయో-వేస్ట్ అని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో ఉన్న 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీల ద్వారా ప్రతిరోజూ భారీ మొత్తంలో బయో-మెడికల్ వ్యర్థాలు వస్తున్నాయి.ఇవి పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం కావడంతో, ఈ వ్యర్థాలను తప్పనిసరిగా 48 గంటల లోపే డిస్పోజ్ చేయాలని ఆయన ఆదేశించారు. బయో-వేస్ట్ నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా సహించబోమని హెచ్చరిస్తూ, హెల్త్ విభాగం, మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్ సంస్థలు పరస్పరం సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. వైద్య వ్యర్థాల సేకరణ, నిల్వ,రవాణా, మరియు శాస్త్రీయంగా నిర్వాహణ చేయడంలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలంటూ దిశా నిర్దేశం చేశారు.
పర్యావరణ పరిరక్షణ–రాష్ట్ర ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్లో ‘నెట్ జీరో పోల్యూషన్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రజలు, ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ల నిషేధం, రీసైక్లింగ్ యూనిట్ల పెంపు, పర్యావరణ అవగాహన కార్యక్రమాల విస్తరణ—రాష్ట్రం పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 48 గంటల్లో కొత్త తుఫాన్?
- సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్లో మార్పులు అవసరం
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!







