మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- November 26, 2025
యూఏఈ: మరణించిన బంధువుల ఫోటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో బహిరంగంగా షేర్ చేస్తున్నారా? అయితే, మీరు భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.ఇలాంటి చర్యలు బాధిత కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు ఇబ్బందులు కలుగుజేస్తాయని, వారి మనసులను బాధిస్తాయని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటువంటి చర్యలు గౌరవం, గోప్యతను ఉల్లంఘించడమే కాకుండా అధికారిక దర్యాప్తులకు ఆటంకం కలిగిస్తాయని, బాధిత కుటుంబ సభ్యుల గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు.
మరణించిన వారి, ప్రమాద బాధితుల లేదా దుఃఖిస్తున్న కుటుంబాల ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేయడం అనైతికమే కాకుండా, జైలు శిక్ష, భారీ జరిమానాలు మరియు ఇతర శిక్షలకు దారితీసే క్రిమినల్ నేరంగా పరిగణిస్తారని యూఏఈలోని చట్టపరమైన మరియు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమాధులు, అంత్యక్రియలు, ప్రమాద దృశ్యాలు లేదా ఆసుపత్రి అత్యవసర గదుల నుండి సున్నితమైన విజువల్ ఫోటోలను తరచుగా కుటుంబానికి తెలియకుండా లేదా అనుమతి లేకుండా ఆన్లైన్లో పోస్ట్ చేయడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ హెచ్చరికలను జారీ చేశారు.
సైబర్ క్రైమ్పై 2021 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 ప్రకారం.. వ్యక్తుల అనుమతి లేకుండా లేదా మరణించిన వారి బంధువుల సమ్మతి లేకుండా వారి ఫోటోలను పోస్ట్ చేయడం చట్టం ఖచ్చితంగా నిషేధిస్తుంది. సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం, ఉల్లంఘనలకు Dh150,000 మరియు Dh500,000 మధ్య జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఈ చర్య ప్రజా క్రమశిక్షణకు హానికరమని భావిస్తే అటువంటి నేరాలకు పాల్పడిన ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







