ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- November 28, 2025
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆధ్వర్యంలో కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ పదిహేనవ ఎడిషన్ 'ఫీరీజ్ కటారా'లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఇందులో ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, పాలస్తీనా, ఇండియా, ఇరాన్, టాంజానియా, ఇరాక్ మరియు సూడాన్ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు వారసత్వ కార్యక్రమం అని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి అన్నారు. ఇది సముద్ర వారసత్వాన్ని జరుపుకోవడానికి, 12 దేశాల సామూహిక సాంప్రదాయ చేతిపనులను కాపాడుకోవడానికి కీలక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా జానపద ప్రదర్శనలు, ప్రత్యక్ష వర్క్షాప్ ల తోపాటు సాంప్రదాయ నౌకానిర్మాణ పద్ధతులను ప్రదర్శించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









