ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- November 28, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజక వర్గాలలో వైద్య సహాయం నిమిత్తం ఎంపి బాలశౌరి సిఫారసు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం నుండి నిధులు మంజూరు చేస్తూ వచ్చిన చెక్కులను సంబందిత వ్యక్తులకు మచిలీపట్నం లోని ఎంపి గారి క్యాంపు కార్యాలయంలో రోజు పంపిణి చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పొందిన వారిలో మచిలీపట్నంలోని పరాసుపేటకు చెందిన కమ్మిలి నాగ శ్రీదేవికి రూ.1,31,952/-, మచిలీపట్నం లోని వాడపాలెం కు చెందిన బండి లక్ష్మి కి రూ.65,141/-, మచిలిపట్నంలోని మేకవానిపాలెం కు చెందిన శ్రీ వాలి శ్రీనివాసరావుకి రు. 21,986/-, మొవ్వ మండలంలోని కూచిపూడి కి చెందిన శ్రీ పోరంకి రాజ కుమార్కి రూ.35,348/-, మచిలీపట్నంలోని చిలకలపూడి కు చెందిన సూరిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరికి రూ.39,595/-, పెడన మండలంలోని పెడన కు చెందిన సిరాపు నాగలక్ష్మి కి రూ.20,000/- పెడన మండలంలోని పెడనకు చెందిన అమృత దుర్గ గారికి 20,000/-, మచిలీపట్నం లోని సర్కిల్ పేటకు చెందిన గుండు బాల వెంకట మురళీధర్ కి 95,837/- వెరశి పైన పేర్కొన్న ఎనిమిది మందికి గాను రూ.4,29,859/- విలువైన చెక్కులను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా అందించడం జరిగింది.
అవసరమైన సమయంలో వైద్యం నిమిత్తం సహాయం చేసినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఆర్ధిక సహాయం మంజూరు నిమిత్తం సిఫారసు చేసిన ఎంపి బాలశౌరికి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!







