సీజన్-9 చివరి కెప్టెన్గా కళ్యాణ్
- November 28, 2025
బిగ్బాస్ హౌస్ లో గత నాలుగు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు దుమ్మురేపిన విషయం తెలిసిందే.ఈసారి ప్రత్యేకంగా ఎక్స్ కంటెస్టెంట్లను పిలిచి టాస్కులు నిర్వహించారు. వారిని ఓడించినవారే కంటెండర్లుగా ఎంపికయ్యారు.చివరకు కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ.. మొత్తం ఆరుగురు కంటెండర్లుగా నిలిచారు.ఇదిలా ఉండగా, తనూజ, భరణి, సుమన్ శెట్టి టాస్కుల్లో ఓడిపోయారు.చివరి కెప్టెన్ను నిర్ణయించే టాస్క్కి బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
కంటెండర్లకు కాదు…కంటెండర్లు కాకపోయిన తనూజ, భరణి, సుమన్ శెట్టిలకే ఈ టాస్క్ ఇచ్చాడు. బజర్ మోగగానే ఈ ముగ్గురిలో ఎవరు ముందు కత్తిని తీసుకుంటే, వారు తాము కెప్టెన్గా చూడాలనుకునే కంటెండర్కు ఆ కత్తిని అందించాలి. కత్తిని అందుకున్న కంటెండర్ మాత్రం రేసులోని ఒకరిని ఎలిమినేట్ చేయాలి.
సుమన్ శెట్టి కత్తి అందుకొని రీతూకి ఇచ్చాడు. ఇక రీతూ ఊహించినట్లే సంజనని పొడిచింది. మీరు గేమ్ గురించి కాకుండా పర్సనల్ విషయాల గురించి మాట్లాడి.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూశారంటూ రీతూ చెప్పింది. దీనికి మరోసారి సంజన ఫైర్ అయింది.ఇక్కడ ఎవరికీ పర్సనల్స్ ఏం ఉండవ్.. ఇదంతా గేమ్యే అంటూ సంజన చెప్పింది.
ఆ తర్వాత భరణి.. డీమాన్ చేతికి కత్తి ఇచ్చాడు. దీంతో డీమాన్.. నేరుగా ఇమ్మానుయేల్ని పొడిచాడు. నేను అడిగినప్పుడు నువ్వు నాకు సాయం చేయలేకపోయావ్ అంటూ మొన్న నామినేషన్స్ పాయింట్యే చెప్పాడు డీమాన్. ఈ మాటకి ఇమ్మూకి కాలింది.నేను ఏడిస్తే ఏడుపొస్తుంది.. నవ్వితే నవ్వొస్తుంది అంటూ ఇక సొల్లు చెప్పకు.. పాయింట్లు లేకపోతే నేను ఇష్టం లేదని చెప్పు.. అంతేకానీ ఇవన్నీ వద్దు అంటూ ఇమ్మూ ఫైర్ అయ్యారు.
ఇక నుంచి నాతో ఇవన్నీ వద్దు అంటూ గట్టిగానే చెప్పాడు ఇమ్మూ.ఇలా మొత్తానికి అందరూ రేసు నుంచి తప్పుకోగా కళ్యాణ్ మిగిలాడు. దీంతో సీజన్-9 (Bigg Boss 9) చివరి కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడన్నమాట.కళ్యాణ్ ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. ఇక సీజన్-9కి శుభం కార్డు పడటానికి మూడు వారాలు మాత్రమే ఉంది. హౌస్లో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







