హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభం..!!
- November 30, 2025
కువైట్: హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించిన అనేక కేసులపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు కువైట్ అటార్నీ జనరల్ కౌన్సెలర్ సాద్ అల్-సఫ్రాన్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కార్మికులను అక్రమంగా తీసుకొచ్చి వారిపై శ్రమ దోపిడికి పాల్పడుతున్న తొమ్మిది కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి పద్ధతులు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2013 చట్టం నంబర్ 91 ద్వారా నిషేధించిన చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇప్పటివరకు 115 మంది బాధితులను రక్షించామని, 48 మంది అనుమానితులను విచారించామని, దర్యాప్తు కొనసాగుతున్నాయని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







