ఢిల్లీలో అగ్నిప్రమాదం..
- November 30, 2025
న్యూ ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భయంకర అగ్ని ప్రమాదం జరిగింది.ఒక బూట్ల దుకాణంలో మంటలు చెలరేగి, అన్నాచెల్లెలు సహా నాలుగుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మంటలకు కారణాలు నిర్ధారించేందుకు
పోలీసుల వివరాల ప్రకారం, నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బూట్ల దుకాణంలో సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరినప్పటికీ, మంటలు వేగంగా పై అంతస్తుల వైపు వ్యాపించాయి.
ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.మృతులను భవన యజమాని సతేందర్ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు.గాయపడిన మమత (40) 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.పోలీసుల క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు మంటలకు కారణాలు నిర్ధారించేందుకు ఘటనా స్థలంలో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







