ఢిల్లీలో అగ్నిప్రమాదం..
- November 30, 2025
న్యూ ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భయంకర అగ్ని ప్రమాదం జరిగింది.ఒక బూట్ల దుకాణంలో మంటలు చెలరేగి, అన్నాచెల్లెలు సహా నాలుగుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మంటలకు కారణాలు నిర్ధారించేందుకు
పోలీసుల వివరాల ప్రకారం, నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బూట్ల దుకాణంలో సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరినప్పటికీ, మంటలు వేగంగా పై అంతస్తుల వైపు వ్యాపించాయి.
ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.మృతులను భవన యజమాని సతేందర్ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు.గాయపడిన మమత (40) 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.పోలీసుల క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు మంటలకు కారణాలు నిర్ధారించేందుకు ఘటనా స్థలంలో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









