విమానాశ్రయాల పై సైబర్ అటాక్ అప్రమత్తమైన కేంద్రం
- December 02, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది, భారత్లోని ఏడు ప్రధాన విమానాశ్రయాలు ఇటీవల సైబర్ దాడులకు గురయ్యాయని. ఈ దాడులు దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రభావితం చేశాయి. దాంతో కొన్ని విమానాల నావిగేషన్ వ్యవస్థల్లో తాత్కాలిక అంతరాయం సంభవించింది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం,ఈ దాడుల్లో GPS స్పూఫింగ్ పద్ధతి ఉపయోగించబడింది. దీనివల్ల నిజమైన GPS సంకేతాల స్థానంలో నకిలీ సంకేతాలు పంపబడడంతో, విమానాల వాస్తవ స్థానం, దిశ, ఎత్తు తప్పుగా చూపించబడే ప్రమాదం ఉంది.
పార్లమెంట్లో పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు వివరించారు, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు రన్వే 10 వైపు ల్యాండింగ్లో GPS స్పూఫింగ్(GPS Spoofing) ప్రభావం ఎదుర్కొన్నట్లు పైలట్లు నివేదించారని. అయితే, ఏ విమానం రద్దు కాలేదని, ల్యాండింగ్ లేదా టేకాఫ్పై ప్రతికూల ప్రభావం లేకుండా, ATC అత్యవసర చర్యలు తీసుకోవడం వల్ల విమానాలు సురక్షితంగా నడిచాయని ఆయన తెలిపారు.
సైబర్ దాడులు దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమాన రవాణా కేంద్రాలను లక్ష్యంగా మార్చడం దేశ సైబర్ భద్రతా వ్యవస్థలో కొంత లోపాన్ని సూచిస్తున్నది. ఇటీవలే ఎయిర్బస్ A320 ఫ్లైట్లకు సాఫ్ట్వేర్ లోపం కారణంగా దాదాపు 388 విమానాల కార్యకలాపాలు ప్రభావితమైన సందర్భం, ఈ సైబర్ దాడి భద్రతా వ్యవస్థలను మరింత బలపర్చాల్సిన అవసరాన్ని చూపుతోంది.
ప్రభుత్వం సైబర్ మానిటరింగ్ను పెంచి, బలమైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో, విమాన నావిగేషన్ వ్యవస్థలు మరింత రక్షితంగా ఉండేలా ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలపై పరిశ్రమ దృష్టి పెట్టనుంది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







