దుబాయ్ లో స్కామ్ సూత్రధారి భారత్ లో అరెస్టు..!!
- December 02, 2025
యూఏఈ: దుబాయ్కు చెందిన బ్లూచిప్ గ్రూప్ యజమాని, యూఏఈలో అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ కు పాల్పడి పారిపోయిన రవీంద్ర నాథ్ సోని భారత్ లో అరెస్టు చేశారు. దాదాపు 18 నెలలగా అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నవంబర్ 30న ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుండి అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ వెల్లడించారు. అంతకుముందు అతని అచూకీ తెలిపిన వారికి 10వేల రూపాయల రివార్డును ప్రకటించారు.
సోని తన దుబాయ్కు చెందిన బ్లూచిప్ కంపెనీ ద్వారా అధిక నెలవారీ ఆదాయాన్ని హామీ ఇచ్చి అనేక మంది బాధితులను మోసం చేశాడు. అతనిపై గతంలో మూడు ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. అతనికి సుదీర్ఘ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో సోనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక చెక్-హోల్డర్కు 10.05 మిలియన్ దిర్హామ్లు తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అయినందుకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బుర్ దుబాయ్లోని అల్ జవాహారా బిల్డింగ్ నుండి పనిచేసిన అతని బ్లూచిప్ కంపెనీ, పెట్టుబడిదారులకు 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్ల పెట్టుబడిపై 3% నెలవారీ రాబడిని హామీ ఇచ్చింది. మార్చి 2024లో ఈ కంపెనీ బోర్డు ఎత్తేసింది. దీంట్లో పెట్టుబడులు పెట్టిన బాధితులు సుమారు 367 మిలియన్ల దిర్హమ్స్ వరకు నష్టపోయారు. వీరిలో అత్యధికులు భారతీయ ప్రవాసులు ఉన్నారు.
అంతకుముందు కూడా సోనీ బుర్ దుబాయ్ ప్రాంగణం నుండి Acme మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ మరియు Acme గ్లోబల్ జనరల్ ట్రేడింగ్ను నిర్వహించాడు. ఇవి కూడా పెట్టుబడిదారుల నిధులను దోచుకున్న తర్వాత కంపెనీలను మూసివేశాడు. అలాగే, భారత్ లో 2022లో అలీఘర్లో "డబుల్-యువర్-మనీ" పథకాన్ని ప్రారంభించి పలువురిని మోసం చేసిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతనిపై హర్యానాలోనూ మోసాలు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కాగా, మే 2024లో అతడి బ్లూచిప్ సంస్థ మూతపడటానికి కొన్ని రోజుల ముందు దాదాపు 41 మిలియన్ డాలర్లను తెలియని క్రిప్టోకరెన్సీ వాలెట్కు బదిలీ చేసినట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి అరెస్టు తమకు సంతోషాన్ని ఇచ్చిందని, అయితే తమ డబ్బులు తిరిగి పొందే వరకు తమ పోరాటం ఆగదని పలువురు బాధితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







