2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- December 04, 2025
రియాద్: 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్ అందుబాటులోకి రానుంది. దిరియా గేట్ను కిద్దియాతో అనుసంధానించే కొత్త మెట్రో ట్రాక్ ను ప్రారంభించనున్నారు. మెట్రో పొడిగింపు మరియు రియాద్ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేవి రియాద్ లో కొనసాగుతున్న అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రణాళికలో భాగంగా అందుబాటులోకి తేనున్నారు.
ఈ ప్రాజెక్ట్ రియాద్ రవాణా నెట్వర్క్ను బలోపేతం చేయనుందని అధికారులు వెల్లడించారు. అలాగే రియాద్ ఫుడ్ స్ట్రీట్, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రియాద్ ను పర్యాటక కేంద్రంగా గుర్తింపును బలోపేతం చేస్తుందని అన్నారు.
వీటితో పాటు మెయిన్ మరియు రింగ్ రోడ్స్ యాక్సెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నగర నెట్వర్క్లోని 500 కిలోమీటర్లకు పైగా ఉన్న కారిడార్లను మెరుగుపరిచి, ప్రధాన కొత్త మార్గాల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతుందని ప్రకటించారు. గ్రీన్ రియాద్ కార్యక్రమంలో భాగంగా పార్కులు, వీధులు, పబ్లిక్ ప్రదేశాలలో సుమారు 7.5 మిలియన్ల కొత్త చెట్లను నాటనున్నారు. ఈ ప్రాజెక్టు తలసరి గ్రీనరీని ప్రస్తుతం ఉన్న 1.7 చదరపు మీటర్ల నుండి 28 చదరపు మీటర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







