భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!

- December 04, 2025 , by Maagulf
భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!

యూఏఈ: యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ఎమిరేట్స్‌లోని చాలా మంది భారతీయ నివాసితులు ఇంటికి డబ్బు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. 

1 దిర్హామ్‌కు రూపాయి మారకం రేటు దాదాపు రూ.24.5కి చేరుకోవడంతో, తమకు ఎక్కువ భారతీయ కరెన్సీ లభించిందని, దీని వలన పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులకు సహాయపడిందని పలువురు యూఏఈ నివాసితులు తెలిపారు. మరోవైపు నివాసితులు మారకపు రేటును సద్వినియోగం చేసుకోవడంతో చెల్లింపులు పెరిగాయని సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. 
షార్జా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అతను సాధారణంగా లక్నోలోని తన కుటుంబానికి ప్రతి నెలా దిర్హామ్‌లు 1,200 నుండి 1,500 వరకు పంపుతాడు. కానీ ఈసారి ఎక్కువ మొత్తాన్ని పంపినట్టు తెలిపాడు. 
దుబాయ్ నివాసి మరియు FMGC సంస్థలో మార్కెటింగ్ హెడ్ అయిన ఆంథోనీ వర్గీస్ మాట్లాడుతూ, మారకం రేటులో ఎంత తేడా వచ్చిందో చూసి తాను ఆశ్చర్యపోయానని, అది క్రిస్మస్ బహుమతి లాంటిదని అన్నారు. తాను సాధారణంగా ప్రతి నెలా Dh2,000 పంపుతానని, ఈసారి Dh3,000 పంపినట్టు పేర్కొన్నాడు. గత నెల కంటే దాదాపు 8వేల రూపాయలు ఎక్కువ వచ్చిందని తెలిపాడు. ఆ అదనపు మొత్తం తన కుమార్తె స్కూల్ బస్సు మరియు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి తమకు సహాయపడిందన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com