భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- December 04, 2025
యూఏఈ: యూఏఈ దిర్హామ్తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ఎమిరేట్స్లోని చాలా మంది భారతీయ నివాసితులు ఇంటికి డబ్బు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు.
1 దిర్హామ్కు రూపాయి మారకం రేటు దాదాపు రూ.24.5కి చేరుకోవడంతో, తమకు ఎక్కువ భారతీయ కరెన్సీ లభించిందని, దీని వలన పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులకు సహాయపడిందని పలువురు యూఏఈ నివాసితులు తెలిపారు. మరోవైపు నివాసితులు మారకపు రేటును సద్వినియోగం చేసుకోవడంతో చెల్లింపులు పెరిగాయని సేల్స్ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు.
షార్జా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతను సాధారణంగా లక్నోలోని తన కుటుంబానికి ప్రతి నెలా దిర్హామ్లు 1,200 నుండి 1,500 వరకు పంపుతాడు. కానీ ఈసారి ఎక్కువ మొత్తాన్ని పంపినట్టు తెలిపాడు.
దుబాయ్ నివాసి మరియు FMGC సంస్థలో మార్కెటింగ్ హెడ్ అయిన ఆంథోనీ వర్గీస్ మాట్లాడుతూ, మారకం రేటులో ఎంత తేడా వచ్చిందో చూసి తాను ఆశ్చర్యపోయానని, అది క్రిస్మస్ బహుమతి లాంటిదని అన్నారు. తాను సాధారణంగా ప్రతి నెలా Dh2,000 పంపుతానని, ఈసారి Dh3,000 పంపినట్టు పేర్కొన్నాడు. గత నెల కంటే దాదాపు 8వేల రూపాయలు ఎక్కువ వచ్చిందని తెలిపాడు. ఆ అదనపు మొత్తం తన కుమార్తె స్కూల్ బస్సు మరియు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి తమకు సహాయపడిందన్నారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







