బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- December 06, 2025
మనామా: లబ్రేట్ బహ్రెయిన్ 2025తో సమానంగా డైవింగ్ మరియు పెరల్స్ పర్యాటక అనుభవాలను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. 2022–2026 పర్యాటక రంగ వ్యూహంలో కీలకమైన సముద్ర కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు, బహ్రెయిన్ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని అథారిటీ లో ప్రాజెక్టుల డిప్యూటీ CEO డానా ఒసామా అల్ సాద్ తెలిపారు. బహ్రెయిన్ సముద్ర వారసత్వాన్ని ఆధునిక పర్యాటకంతో కలపడం ద్వారా డైవింగ్ మరియు పెరల్స్ వేట బహ్రెయిన్ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తుందని అన్నారు.
ఈ అనుభవాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని, పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఇందులో భాగం కావచ్చని పేర్కొన్నారు. పర్యాటక పర్యటనలు సాదా మరియు బు మహర్ నుండి బయలుదేరుతాయని తెలిపారు. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల లైసెన్స్ పొందిన డైవర్ల కోసం పెర్ల్ డైవింగ్ మరియు 16 అంతకంటే ఎక్కువ వయస్సు గల ఈతగాళ్ల కోసం షాలో డైవింగ్ అందుబాటులో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







