బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- December 06, 2025
మనామా: లబ్రేట్ బహ్రెయిన్ 2025తో సమానంగా డైవింగ్ మరియు పెరల్స్ పర్యాటక అనుభవాలను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. 2022–2026 పర్యాటక రంగ వ్యూహంలో కీలకమైన సముద్ర కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు, బహ్రెయిన్ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని అథారిటీ లో ప్రాజెక్టుల డిప్యూటీ CEO డానా ఒసామా అల్ సాద్ తెలిపారు. బహ్రెయిన్ సముద్ర వారసత్వాన్ని ఆధునిక పర్యాటకంతో కలపడం ద్వారా డైవింగ్ మరియు పెరల్స్ వేట బహ్రెయిన్ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తుందని అన్నారు.
ఈ అనుభవాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని, పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఇందులో భాగం కావచ్చని పేర్కొన్నారు. పర్యాటక పర్యటనలు సాదా మరియు బు మహర్ నుండి బయలుదేరుతాయని తెలిపారు. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల లైసెన్స్ పొందిన డైవర్ల కోసం పెర్ల్ డైవింగ్ మరియు 16 అంతకంటే ఎక్కువ వయస్సు గల ఈతగాళ్ల కోసం షాలో డైవింగ్ అందుబాటులో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







