ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- December 06, 2025
రియాద్: కార్పొరేట్ స్థిరత్వ డ్యూ డిలిజెన్స్ మరియు కార్పొరేట్ నివేదికలపై రెండు ప్రతిపాదిత యూరోపియన్ యూనియన్ చట్టాలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూరోపియన్ మార్కెట్లో పనిచేస్తున్న ప్రధాన కంపెనీలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ మరియు కువైట్లతో కూడిన ల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
యూరోపియన్ పార్లమెంట్ కొన్ని నిబంధనలను సులభతరం చేయడానికి లేదా తొలగించడానికి సవరణలను ప్రతిపాదించినప్పటికీ, ఈ మార్పులు GCC దేశాల అంచనాలను అందుకోలేకపోతున్నాయని, ఐరోపాలో చురుకుగా ఉన్న గల్ఫ్ కంపెనీల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. సభ్య దేశాలు ప్రపంచ మానవ హక్కులు, పర్యావరణ మరియు వాతావరణ సంస్థలలో నిబద్ధత కలిగిన భాగస్వాములుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
కొత్త చట్టాలకు లోబడి ఉన్న గల్ఫ్ కంపెనీలు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల ప్రకారం పనిచేస్తున్నప్పటికీ యూరోపియన్ మార్కెట్ నుండి వైదొలగడం మరియు ప్రత్యామ్నాయాలతో ఎదురయ్యే నష్టాలను అంచనా వేయవలసి రావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









