ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- December 06, 2025
రియాద్: కార్పొరేట్ స్థిరత్వ డ్యూ డిలిజెన్స్ మరియు కార్పొరేట్ నివేదికలపై రెండు ప్రతిపాదిత యూరోపియన్ యూనియన్ చట్టాలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూరోపియన్ మార్కెట్లో పనిచేస్తున్న ప్రధాన కంపెనీలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ మరియు కువైట్లతో కూడిన ల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
యూరోపియన్ పార్లమెంట్ కొన్ని నిబంధనలను సులభతరం చేయడానికి లేదా తొలగించడానికి సవరణలను ప్రతిపాదించినప్పటికీ, ఈ మార్పులు GCC దేశాల అంచనాలను అందుకోలేకపోతున్నాయని, ఐరోపాలో చురుకుగా ఉన్న గల్ఫ్ కంపెనీల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. సభ్య దేశాలు ప్రపంచ మానవ హక్కులు, పర్యావరణ మరియు వాతావరణ సంస్థలలో నిబద్ధత కలిగిన భాగస్వాములుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
కొత్త చట్టాలకు లోబడి ఉన్న గల్ఫ్ కంపెనీలు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల ప్రకారం పనిచేస్తున్నప్పటికీ యూరోపియన్ మార్కెట్ నుండి వైదొలగడం మరియు ప్రత్యామ్నాయాలతో ఎదురయ్యే నష్టాలను అంచనా వేయవలసి రావచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం







