10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- December 06, 2025
యూఏఈ: ఇండియాలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ను కష్టాలు విడవడం లేదు. విమాన సర్వీసుల రద్దుతో దుబాయ్ మరియు ముంబై మధ్య సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కొంతమంది ప్రయాణీకులు తక్కువ వెయిటింగ్ తో బయటపడుతుండగా, మరికొందరు 10 గంటలు వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. గురువారం రాత్రి ముంబైకి విమానంలో ప్రయాణించడానికి తన బంధువు ఒకరు దాదాపు 10 గంటలు వెయిటింగ్ చేశాడని దుబాయ్ నివాసి మహమ్మద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ రాత్రి 10 గంటలకు బయలుదేరిందని పేర్కొన్నాడు.
యూఏఈ నుండి బయలుదేరే అనేక ఇతర ఇండిగో విమానాలు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి.శుక్రవారం ఉదయం 3:20 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-కోజికోడ్ విమానం చివరికి ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఆలస్యంతో ఉదయం 11:29 గంటలకు బయలుదేరింది. ఉదయం 11:45 గంటలకు బయలుదేరాల్సిన కొచ్చి ఇండిగో విమానం 30 నిమిషాల తరువాత మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5:15 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-అహ్మదాబాద్ విమానం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళ్లింది. అయితే, విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రభావితం అయిన ప్రయాణికులకు ఇండిగో బహిరంగ క్షమాపణ చెప్పింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







