అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- December 06, 2025
హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయ లక్ష్మి రచనా వ్యాసంగం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సాహితీ స్వర్ణోత్సవం వంశీ ఆర్ట్స్ థియేటర్స్, లేఖిని రచయిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఘనంగా జరిగింది.
ఈ సదస్సులో విజయ లక్ష్మి రచించిన వివిధ సాహిత్య ప్రక్రియల పై ప్రముఖ సాహితీవేత్తలు విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.
సాహిత్య ప్రక్రియలపై విశ్లేషణలు
- నాటకాలు పై సరస్వతి సమన్వయంలో ఇనంపూడి శ్రీలక్ష్మి, పి.నాగలక్ష్మి, దుర్గ వడ్లమాని ప్రసంగించారు.
- కథా రచన పై కామేశ్వరి సమన్వయంలో సుధామ నండూరి, నాగమణి, వి.నాగలక్ష్మి, కృష్ణకుమారి, కె.అలివేణి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
- నవలలు పై శామీర్, జానకి నిర్వహణలో విహారి, జే.చెన్నయ్య, గంటి భానుమతి, ఉమాదేవి, వి. మణి, రేణుక, సర్వమంగళ విశ్లేషణ చేశారు.
ప్రారంభ సభలో ప్రముఖుల ప్రసంగాలు
ఉదయం జరిగిన ప్రారంభ సమావేశంలో ప్రముఖ రచయిత జగన్నాథ శర్మ, డాక్టర్ గౌరీశంకర్, డాక్టర్ యెన్.వేణుగోపాల్, శిల సుభద్ర, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి పాల్గొని, విజయలక్ష్మి బహుముఖ ప్రజ్ఞ, సాహిత్య వ్యాప్తిపై ప్రశంసలు తెలిపారు.
ముగింపు సభలో మరిన్ని అభినందనలు
సాయంత్రం జరిగిన ముగింపు సభలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అధ్యక్షత వహిస్తూ,“విజయ లక్ష్మి రచనల్లో అభ్యుదయ భావాలు, మానవతా విలువలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది,” అని అభినందించారు.
ప్రముఖ దర్శకుడు వి.యెన్. ఆదిత్య మాట్లాడుతూ,“విజయలక్ష్మి ‘బొమ్మ’ నవలను సినిమా గా తీసేందుకు సిద్ధమవుతున్నాను,” అని ప్రకటించారు.
అంధ్రప్రదేశ్ సంస్కృత తెలుగు అకాడమీ చైర్మన్ శరత్ చంద్ర మాట్లాడుతూ,“విజయలక్ష్మి దమ్మున్న రచయిత్రి,” అని ప్రశంసించారు.
ప్రముఖ నాటక రచయితలు విజయభాస్కర్, రాంకీ రామురెడ్డి, తోటకూర ప్రసాద్, రామ కోటేశ్వరరావు తదితరులు తమ శుభాభినందనలు తెలియజేశారు.
సన్మానాలు–బిరుదులు – ప్రదర్శనలు
వంశీ రామరాజు, విజయ లక్ష్మికి ‘సాహితీ సామ్రాజ్ఞి’ బిరుదును ప్రదానం చేశారు.
లేఖిని రచయిత్రులు ఆమెకు పాతిక వేల రూపాయల నగదు పురస్కారం మరియు జ్ఞాపిక అందించారు.
సమ్మిట్ ముగింపులో విజయలక్ష్మి రచించిన ‘మహారాణి’ హాస్య నాటికను జి.దర్శకత్వంలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమం మొత్తం విజయలక్ష్మి సాహిత్య ప్రస్థానానికి ఘనతను చాటిచెప్పే వేడుకగా నిలిచింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









