విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- March 10, 2026
దోహా: తమ దేశంలో పర్యటించే విజిటర్స్ కు ఖతార్ సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ముఖ్యంగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముందు జాగ్రత్త హెచ్చరికలు అందుకున్నప్పుడు ఎలా స్పందించాలో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ మేరకు మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్కు వచ్చే సందర్శకులకు భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని , ప్రజా భద్రతను నిర్ధారించడానికి భద్రతా సిబ్బందితో సహకరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు :
జాతీయ హెచ్చరిక వ్యవస్థ జారీ చేసిన హెచ్చరిక నోటిఫికేషన్లను తీవ్రంగా పరిగణించాలి. అధికారులు సూచనలను పాటించాలి.
భవనం లోపల సురక్షిత ప్లేసులో ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ప్రమాదం లేదని అధికారిక సూచనలు నిర్ధారించే వరకు ఇళ్లలోనే ఉండాలి.
ఏదైనా పేలుడు శబ్దం విన్నట్లయితే లేదా జాతీయ హెచ్చరిక నోటిఫికేషన్ అందితే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదు. సమీపంలోని సురక్షిత భవనాలకు వెంటనే వెళ్లి కిటికీలు, గ్లాస్ వస్తువులకు దూరంగా ఉండాలి.
షాపింగ్ మాల్స్ లేదా మార్కెట్లలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలను ముందే తెలుసుకోవాలి.
తరలింపు అవసరమైతే, మెట్లు మరియు అత్యవసర ఎగ్జిట్ లను ఉపయోగించాలి. లిఫ్ట్లకు దూరంగా ఉండాలి.
రద్దీ గా ఉండే ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
అనుమానాస్పద వస్తువులను టచ్ చేయడానికి ప్రయత్నించవద్దు.
ఏవైనా అనుమానాస్పద వస్తువులను గమనించినట్లయితే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలి.
తెలియని వస్తువుల సమీపంలోకి వెళ్లవద్దు. సైట్లో ఉన్న వస్తువులు లేదా శకలాలకు దూరంగా వెళ్లాలి.
ఆయా సంఘటనలను ఫోటో/వీడియో తీసేందుకు ప్రయత్నించవద్దు.
భద్రతా సిబ్బందితో సహకరించాలి. భద్రతా సిబ్బంది సూచనలను పాటించాలి. అత్యవసర సమయాల్లో వారికి సహకరించాలి.
ఈ భద్రతా మార్గదర్శకాలను పాటించడం సందర్శకుల భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుందని మరియు అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో భద్రతా అధికారుల ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









