తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!

- December 07, 2025 , by Maagulf
తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!

మనామా: బహ్రెయిన్ లో చట్టాలను ఉల్లంఘించి కంటెంట్‌ను వినియోగించిన తొమ్మిది సోషల్ మీడియా ఖతాలపై చర్యలు తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ కింద ఉన్న యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలను ప్రారంభించాయని బహ్రెయిన్ ఇంటిరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.

పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో కూడిన విషయాలను పంచుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు.ఇది పౌర శాంతికి ముప్పు కలిగిస్తుందని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాంటి కంటెంట్‌ను తిరిగి పోస్ట్ చేసే వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు.సామాజిక సామరస్యాన్ని కాపాడాలని, బహ్రెయిన్ విలువలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వశాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com