తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- December 07, 2025
మనామా: బహ్రెయిన్ లో చట్టాలను ఉల్లంఘించి కంటెంట్ను వినియోగించిన తొమ్మిది సోషల్ మీడియా ఖతాలపై చర్యలు తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ కింద ఉన్న యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలను ప్రారంభించాయని బహ్రెయిన్ ఇంటిరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.
పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో కూడిన విషయాలను పంచుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు.ఇది పౌర శాంతికి ముప్పు కలిగిస్తుందని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాంటి కంటెంట్ను తిరిగి పోస్ట్ చేసే వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు.సామాజిక సామరస్యాన్ని కాపాడాలని, బహ్రెయిన్ విలువలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









