తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- December 07, 2025
మనామా: బహ్రెయిన్ లో చట్టాలను ఉల్లంఘించి కంటెంట్ను వినియోగించిన తొమ్మిది సోషల్ మీడియా ఖతాలపై చర్యలు తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ కింద ఉన్న యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలను ప్రారంభించాయని బహ్రెయిన్ ఇంటిరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.
పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో కూడిన విషయాలను పంచుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు.ఇది పౌర శాంతికి ముప్పు కలిగిస్తుందని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాంటి కంటెంట్ను తిరిగి పోస్ట్ చేసే వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు.సామాజిక సామరస్యాన్ని కాపాడాలని, బహ్రెయిన్ విలువలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







