బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!

- December 08, 2025 , by Maagulf
బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!

మనమా: బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్  పై  గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జిసిసి సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.

ముఖ్యంగా, ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న మూడు దీవులు టర్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు అబు ముసా లపై యూఏఈ చట్టబద్ధమైన హక్కులకు విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్-దుర్రా ఆఫ్‌షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుదైవి మండిపడ్డారు.

ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పులుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com