జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- December 16, 2025
జోర్డాన్ లో మోదీ సందడి.. యువరాజుతో కారులో షికారు ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ లో కారులో తిరుగుతూ సందడి చేశారు.జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి సందడి చేశారు.యువరాజుతో కలిసి మోదీ కారులో జర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఇవి వైరల్ గా మారాయి. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.
మోదీ సందర్శించిన ఈ మ్యూజియం దేశంలోనే అతిపెద్దది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రిక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోదీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారును నడిపారు.
రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం జర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్ భారత్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.మోదీ పర్యటనతో జోర్డాన్, భారత్ లమధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగుపడనున్నది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







