జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- December 16, 2025
జోర్డాన్ లో మోదీ సందడి.. యువరాజుతో కారులో షికారు ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ లో కారులో తిరుగుతూ సందడి చేశారు.జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి సందడి చేశారు.యువరాజుతో కలిసి మోదీ కారులో జర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఇవి వైరల్ గా మారాయి. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.
మోదీ సందర్శించిన ఈ మ్యూజియం దేశంలోనే అతిపెద్దది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రిక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోదీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారును నడిపారు.
రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం జర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్ భారత్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.మోదీ పర్యటనతో జోర్డాన్, భారత్ లమధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా మెరుగుపడనున్నది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









