ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- December 16, 2025
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం పాటలు ప్రతి సంవత్సరం కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 15-16 కోట్లు అంటేనే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు రూ. 20 కోట్ల మార్క్ దాటడం సర్వసాధారణమైపోయింది.ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..2025 మెగా వేలంలో రిషబ్ పంత్ రూ. 27 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(IPL) రూ. 26.75 కోట్లకు, కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడుపోయారు. 2024లో మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు, ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లకు అమ్ముడుపోగా, వెంకటేష్ అయ్యర్ 2025లో రూ. 23.75 కోట్లకు కేకేఆర్ సొంతమయ్యాడు. గత మూడేళ్లుగా ముఖ్యంగా కోల్కతా(Kolkata) నైట్ రైడర్స్ భారీగా ఖర్చు చేస్తోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









