E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- December 24, 2025
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) పై ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ ప్రమాదానికి డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణమని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ కారణంగా వాహనం అదుపుతప్పి కాంక్రీట్ బారియర్ను ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయాలతో బయటపడ్డారని దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ అలెర్ట్ జారీ చేశారు. బాగా అలసిపోయినప్పుడు, మగతగా ఉన్నప్పుడు లేదా తక్కువ లేదా అధిక బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని, లేదంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
అయితే, కొందరు డ్రైవర్లు ఇవి చిన్న లక్షణాలే అనుకుంటారని, కానీ డ్రైవర్ కొన్ని సెకన్లలో పూర్తి నియంత్రణను కోల్పోవచ్చని, ఇది వారి జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు. స్పృహ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన కారణాలలో ఒకటి అని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







