ఓటీటీకి వచ్చేసిన ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ..
- December 25, 2025
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ సినిమా ప్రైడ్ మూవీ బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి 1, బాహుబలి 1 సినిమాలు బాక్సాఫీస్ ను షాక్ చేశాయి. మొదటి భాగం రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా రెండో భాగంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఒకే ప్రాజెక్టుగా రూపొందించాడు దర్శకుడు.
మూడు గంటల నలభై నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అయితే, బాహుబలి: ది ఎపిక్ ను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 25 అర్దరాత్రి నుంచి ఈ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







