చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- December 27, 2025
చైనా: చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్లను వేరుచేసే తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే టన్నెల్గా రికార్డు సృష్టించింది. దీనివల్ల ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గింది. కఠినమైన వాతావరణంలో 5 ఏళ్ల పాటు శ్రమించి చైనా ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు.
షిన్జియాంగ్ ప్రాంతంలోని ఉరుమ్కి, కోర్లా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా ఈ మెగా టన్నెల్ను నిర్మించారు. డిసెంబర్ 26వ తేదీన ఈ టన్నెల్ను అధికారికంగా ప్రారంభించారు. చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ (సీసీసీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు రెండు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే టన్నెల్, అత్యంత లోతైన నిలువు షాఫ్ట్. దీని పొడవు 22.13 కిలోమీటర్లు కాగా.. ఈ ఎక్స్ప్రెస్వే టన్నెల్ కోసం నిర్మించిన అత్యంత లోతైన వర్టికల్ షాఫ్ట్ దాదాపు 706 మీటర్లు ఉంటుంది.
గతంలో ఉరుమ్కి, కోర్లా మధ్య ప్రయాణానికి 7 గంటలకు పైగా పట్టేది. కానీ ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం మూడున్నర గంటలకు తగ్గింది. అంటే ప్రయాణ సమయం సగానికి తగ్గింది. పర్వతాల గుండా వెళ్లే 20 నిమిషాల ప్రయాణమే ఈ మార్పుకు కారణం. సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో.. మైనస్ 42 డిగ్రీల గడ్డకట్టే చలిలో ఈ టన్నెల్ నిర్మించారు. 324.7 కిలోమీటర్ల పొడవైన ఉరుమ్కి-యులి ఎక్స్ప్రెస్వేలో భాగంగా ఈ టన్నెల్ను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 46.7 బిలియన్ యువాన్లు (దాదాపు మన కరెన్సీలో రూ.60 వేల కోట్లు). సాధారణ పద్ధతుల్లో ఈ టన్నెల్ కట్టడానికి 10 ఏళ్లు పట్టేది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







