చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- March 11, 2026
న్యూ ఢిల్లీ: సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో నగదు డ్రా చేసుకున్నప్పుడు పెద్ద కరెన్సీ నోట్లు మాత్రమే వస్తుంటాయి. ఎక్కువగా రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చిన్న మొత్తాల లావాదేవీలకు అవసరమైన రూ.10, రూ.20, రూ.50 నోట్లు ఏటీఎంలలో లభించకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్న కరెన్సీ నోట్లను కూడా ఏటీఎంల ద్వారా పొందే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చిన్ననోట్ల కొరత ఉందనే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రస్తుత సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మెషీన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 నోట్లు నేరుగా డ్రా చేసుకునే వీలుంటుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో చిన్న కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.
- రూ.10 నోట్లు – రూ.439.4 కోట్ల విలువ
- రూ.20 నోట్లు – రూ.193.7 కోట్ల విలువ
- రూ.50 నోట్లు – రూ.130.3 కోట్ల విలువ
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే చిన్న మొత్తాల లావాదేవీల్లో ఎదురయ్యే చిల్లర సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







