హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- December 31, 2025
దోహా: 2025లో ఖతార్ పర్యాటక రంగం ఘనంగా ముగిస్తుంది. హోటల్ రూమ్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో 9.7 మిలియన్లకు చేరుకున్నాయి. 2025 చివరి రోజు సందర్శకుల సంఖ్య దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఖతార్ ఛాంబర్లోని పర్యాటక మరియు ప్రదర్శనల కమిటీ సభ్యుడు అయమాన్ అల్ ఖుద్వా తెలిపారు.
జనవరి మరియు నవంబర్ మధ్య సందర్శకుల రాక సుమారు 4.4 మిలియన్లకు చేరుకుందని, డిసెంబర్ లెక్కలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. విజిటర్స్ సంఖ్య మరియు హోటల్ ఆక్యుపెన్సీ పరంగా 2025 సంవత్సరం గతంలోని అన్ని రికార్డులను అధిగమిస్తుందని అల్ ఖుద్వా అన్నారు.
ఈ ఏడాది ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్, ఫిఫా అరబ్ కప్ మరియు అనేక రకాల స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఖతార్ వేదికగా జరిగాయని తెలిపారు. ఏటా ఖతార్ ను సందర్శించే విజిటర్స్ సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని అయమాన్ అల్ ఖుద్వా వెల్లడించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







