ఇండిగో విమానంలో ఐసీస్ కు అనుకూలంగా నినాదాలు

- July 28, 2016 , by Maagulf
ఇండిగో విమానంలో ఐసీస్ కు అనుకూలంగా నినాదాలు

దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్ కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com