భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ట్రయల్ రన్ సక్సెస్
- January 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (AP) లోని, భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది.ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. మరో 4-5 నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం.విశాఖ ఎకనమిక్ రీజియన్కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







