భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ట్రయల్ రన్ సక్సెస్
- January 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (AP) లోని, భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది.ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. మరో 4-5 నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం.విశాఖ ఎకనమిక్ రీజియన్కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







