బహ్రెయిన్లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- January 06, 2026
మనామా: ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ లో జనవరి 22 నుండి 31 వరకు 36వ ఎడిషన్ ఆటమ్ ఫెయిర్ 2026ను నిర్వహించనున్నారు. బహ్రెయిన్ లో ప్రముఖ వార్షిక కార్యక్రమాలలో ఈ ఆటమ్ ఫెయిర్ ఒకటని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, EWB చైర్పర్సన్ సారా అహ్మద్ బుహిజీ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు ఇన్ఫార్మా బహ్రెయిన్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. 36వ ఎడిషన్ ఈ ఫెయిర్ చరిత్రలో అతిపెద్ద ఎగ్జిబిషన్ గా రికార్డు సృష్టించనున్నదని పేర్కొన్నారు. 24 దేశాల నుండి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, 2 లక్షల కంటే ఎక్కువగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆటమ్ ఫెయిర్ 2026 ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లోని హాల్స్ 2, 3, 5 మరియు 6లలో జరుగుతుంది. ప్రవేశం ఉచితం. అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







