బహ్రెయిన్లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- January 06, 2026
మనామా: ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ లో జనవరి 22 నుండి 31 వరకు 36వ ఎడిషన్ ఆటమ్ ఫెయిర్ 2026ను నిర్వహించనున్నారు. బహ్రెయిన్ లో ప్రముఖ వార్షిక కార్యక్రమాలలో ఈ ఆటమ్ ఫెయిర్ ఒకటని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, EWB చైర్పర్సన్ సారా అహ్మద్ బుహిజీ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు ఇన్ఫార్మా బహ్రెయిన్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. 36వ ఎడిషన్ ఈ ఫెయిర్ చరిత్రలో అతిపెద్ద ఎగ్జిబిషన్ గా రికార్డు సృష్టించనున్నదని పేర్కొన్నారు. 24 దేశాల నుండి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, 2 లక్షల కంటే ఎక్కువగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆటమ్ ఫెయిర్ 2026 ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లోని హాల్స్ 2, 3, 5 మరియు 6లలో జరుగుతుంది. ప్రవేశం ఉచితం. అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







