సిరియాలో ఐసిస్ రెండు కారు బాంబులు పేల్చారు
- July 28, 2016
సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఖ్వాంష్లీలో రెండు కారు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 50మంది మృతి చెందారు. సిరియాలో కుర్దులను టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. కుర్దులు ఎక్కువగా ఉండే ఖ్వాంష్లీ పట్టణంలో కారు బాంబులతో విధ్వంసం సృష్టించారు. ఖ్వాంష్లీ మార్కెట్ ఏరియాలో మొదట ఓ కారు బాంబు పేలింది. ఈ పేలుడు జరిగిన పది నిమిషాల్లో మరో కారు బాంబు పేల్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందమందకిపైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సరిహద్దులో ఉన్న ఈ పట్టణంలో నెలరోజుల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కారుబాంబు పేల్చి 20మందిని బలిగొన్నారు. తాజాగా మరోసారి దాడి చేయడంతో సరిహద్దులను సిరియా ప్రభుత్వం మూసివేసింది.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









