సిరియాలో ఐసిస్ రెండు కారు బాంబులు పేల్చారు

- July 28, 2016 , by Maagulf
సిరియాలో ఐసిస్ రెండు కారు బాంబులు పేల్చారు

సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఖ్వాంష్లీలో రెండు కారు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 50మంది మృతి చెందారు. సిరియాలో కుర్దులను టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. కుర్దులు ఎక్కువగా ఉండే ఖ్వాంష్లీ పట్టణంలో కారు బాంబులతో విధ్వంసం సృష్టించారు. ఖ్వాంష్లీ మార్కెట్ ఏరియాలో మొదట ఓ కారు బాంబు పేలింది. ఈ పేలుడు జరిగిన పది నిమిషాల్లో మరో కారు బాంబు పేల్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందమందకిపైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సరిహద్దులో ఉన్న ఈ పట్టణంలో నెలరోజుల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కారుబాంబు పేల్చి 20మందిని బలిగొన్నారు. తాజాగా మరోసారి దాడి చేయడంతో సరిహద్దులను సిరియా ప్రభుత్వం మూసివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com