కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- January 07, 2026
కువైట్: కువైట్ వెలుపల పనిచేస్తున్న అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లో ప్రమేయం ఉన్న ఇద్దరు భారతీయ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. కైఫాన్ మరియు షువైఖ్ నివాస ప్రాంతాలలో రైడ్స్ సమయంలో అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి సుమారు 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్ సంబంధిత నేరాలలో పాల్గొనే వారపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్







